ప్రసిద్ధ శైవక్షేత్రం ఇరువర్గాల మధ్య ఘర్షణతో అట్టుడికింది. టీ దుకాణం దగ్గర మొదలైన చిన్న గొడవ విధ్వంసానికి దారి తీసింది. దేవాలయం సమీపంలోని దుకాణాలను కర్నాటకకు చెందిన కొందరు భక్తులు తగులబెట్టారు. స్థానికంగా టీకొట్టు నడుపుతున్న ఓ హిందువేతరుడికి కర్నాటక నుంచి వచ్చిన ఓ భక్తుడికి చిన్న వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో టీ దుకాణం యజమాని గొడ్డలితో కర్నాటక భక్తుడిపై దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలో కర్నాటక భక్తులకు, స్థానిక దుకాణాల యజమానులకు పెద్ద గొడవైంది. ఆగ్రహంతో ఊగిపోయిన కర్నాటక భక్తులు అక్కడి దుకాణాలకు నిప్పుపెట్టారు. పాతాళగంగ, నంది సర్కిల్ పరిపాలనా భవనం ముందున్న తాత్కాలిక దుకాణాలనూ ధ్వంసం చేశారు. దీంతో అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. శ్రీశైల పీఠాధిపతి సిద్దరామ పండితారాధ్య శివాచార్య సహా ఆలయ ఈవో కర్ణాటక భక్తులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటన నేపథ్యంలో శ్రీశైలంలో అన్యమతస్తుల వ్యాపారంపై చర్చ మొదలైంది. ఇక్కడి దుకాణాలు చాలా వరకు అన్యమతస్తులే నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని ప్రధాన ఆలయాల్లోని ముఖ్య విభాగాల్లో అన్యమతస్తులు ఉన్నారని భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)