కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్టు.. ప్రస్తుతం ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నట్టు ట్విటర్ లో తెలిపారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు, తక్షణమే ఐసోలేషన్లోకి వెళ్లాలని.. పరీక్షలు చేయించాకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తనకు కరోనా సోకడంతో షెడ్యూల్ లో ఉన్న ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.
బొమ్మై జులై 25, 26న ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన వివిధ శాఖల ప్రతినిధులు కూడా ఢిల్లీ వెళ్లారు.