విపక్ష సభ్యుల నిరసనల మధ్యనే మతమార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. సామూహిక, బలవంతపు మతమార్పిడులకు పాల్పడేవారికి ఇక నుంచి జైలు శిక్షలుంటాయి. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ బిల్లును విపక్షాలతో పాటు…. క్రైస్తవ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగమే కర్నాటకలో మతమార్పిడి నిరోధక బిల్లు అని కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. కర్నాటక కొత్తగా తీసుకువచ్చిన మత స్వేచ్ఛ హక్కు బిల్లు- 2021.. ప్రలోభాలకు గురిచేయడం ద్వారా కానీ, బలవంతంగా కానీ, మోసపూరిత విధానాల ద్వారా కానీ, సామూహికంగా కానీ మతమార్పిడులను నిరోధిస్తుంది.