కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి మే 16నే రాజీనామా చేసినట్టు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఇండిపెండెంట్ వాయిస్ గా ఉండటం ఎంతో ముఖ్యమని.. ప్రతిపక్షంలో ఉంటూనే మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు కూటమిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామని సిబల్ అన్నారు.
కాంగ్రెస్ G-23 గ్రూపులో ప్రముఖుడైన కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేసి, సమాజ్వాదీ పార్టీ మద్దతుతో లక్నోలో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర పార్టీ నేతల సమక్షంలో ఉత్తరప్రదేశ్ నుంచి సిబల్ తన నామినేషన్ దాఖలు చేశారు. జులై 4న సిబల్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు.