
INDIA – JANUARY 10: Jitin Prasada, Cognress Member of Parliament (MP) from Shahjahanpur, Uttar Pradesh in New Delhi, India (Kunwar Jitin Prasad) (Photo by Sumeet Inder Singh/The The India Today Group via Getty Images)
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద ఇటీవల కపిల్ సిబల్ పై చేసిన వ్యాఖ్యల ద్వారా వెలుగులోకి వచ్చారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేయడంతో కపిల్ సిబల్పై విరుచుకుపడ్డారు. సిబల్ రాజీనామా తర్వాత, గత సంవత్సరం కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వచ్చిన నాయకుడు జితిన్ ప్రసాద, తనపై కపిల్ సిబల్ చేసిన పాత ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఆయన్ని దూషించారు.
జితిన్ ప్రసాద 2021 జూన్ 10న బీజేపీలో చేరినప్పుడు, ” జితిన్ ప్రసాద బీజేపీలో చేరాడు. బీజేపీ నుంచి ‘ప్రసాదం’ లభిస్తుందా?.. లేక యూపీ ఎన్నికల ‘క్యాచ్’ మాత్రమేనా?.. ఇటువంటి ఒప్పందాలలో అయితే ‘ఐడియాలజీ’ తో సంబంధం లేనప్పుడు మార్పు సులభమే..”అంటూ కపిల్ సిబల్ వెటకారంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ ను వీడడంతో ఆ ట్వీట్కు రిప్లై ఇస్తూ జితిన్ ప్రసాద ఇప్పుడు సిబల్ను తిట్టాడు. “ప్రసాదం ఎలా ఉంది” అని కపిల్ సిబల్ ను ఉద్దేశించి జితిన్ ట్వీట్ చేశారు.
https://twitter.com/JitinPrasada/status/1529412025859731456?s=20&t=nfNMWcBeGLlknsmrTwSNeQ
కపిల్ సిబల్ జార్ఖండ్లోని జార్ఖండ్ ముక్తి మోర్చా కోటా నుంచి రాజ్యసభకు వెళ్లడంపై చర్చ జరిగింది. అయితే బుధవారం, ఆయన రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినప్పుడు, SP చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆయనతో ఉన్నారు. మూడు ఎస్పీ సీట్లలో ఒకదానిపై సిబల్ రాజ్యసభకు వెళ్తారని అఖిలేష్ తర్వాత చెప్పారు.
దాదాపు 30 ఏళ్లుగా కాంగ్రెస్లో ఉండి, గత రెండేళ్లుగా గాంధీ కుటుంబ నాయకత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తున్న సీనియర్ రాజకీయ నాయకుడు కపిల్ సిబల్ మే 16న కాంగ్రెస్ను వీడారు. ఉదయపూర్లో కాంగ్రెస్ చింతన్ శివిర్ తర్వాత, సిబల్, గాంధీ కుటుంబానికి మధ్య బంధం తెగిపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్కు బలమైన మూలస్తంభాలుగా ఉన్న నాయకుల జాబితాలో ఆయన కూడా ఉన్నారు.