ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో శుక్రవారం హింస చెలరేగింది. ఇస్లాంవాదులు హిందువులను వారి పేర్లతో వేరు చేసి వారిపై దాడి చేశారు. మహ్మద్ ప్రవక్తపై ‘దూషణ’కు పాల్పడ్డారంటూ బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు నిరసనగా ఆ ప్రాంతంలోని దుకాణాలను మూసివేయాలని ఇస్లాంవాదులు పిలుపునివ్వడంతో హింస చెలరేగింది.
శుక్రవారం ప్రార్థనల తర్వాత ముస్లిం గుంపు బెకాన్గంజ్ జిల్లాలోని హిందువులను వారి దుకాణాలను మూసివేయమని బలవంతం చేయడం ప్రారంభించింది. వారు అభ్యంతరం వ్యక్తపరచడంతో ఆగ్రహించిన ముస్లిం గుంపు హిందువులపై రాళ్లు విసరడం ప్రారంభించింది. ఇస్లాంవాదులు అక్కడి జనాల పేర్లు తెలుసుకోవాలని పట్టుబట్టారు.. హిందువులపై దాడి చేశారు.
ఒక రిక్షా తొక్కే అతన్ని ఇస్లామిస్టులు ఆపి పేరును అడిగారు. రిక్షా పుల్లర్ తన పేరు ముఖేష్ అని చెప్పడంతో అతనిపై దాడి చేశారు. అతడి తలకు బలమైన గాయం తగిలింది. రక్తపు మడుగులో ఉన్న ముఖేష్ను వదిలి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రిక్షా ఓనర్ ను ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనపై సీరియస్ అయ్యారు. గ్యాంగ్స్టర్ చట్టం, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) ఉపయోగించాలని యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాటు హోం అదనపు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. నేరస్తుల ఆస్తులను జప్తు చేయాలని.. అవసరమైతే బుల్డోజర్లను ఉపయోగించాలని.. తద్వారా భవిష్యత్తులో మతపరమైన విద్వేషాన్ని వ్యాప్తి చేసి రాష్ట్రంలో వాతావరణాన్ని చెడగొట్టడానికి ఎవరూ సాహసించకూడదని అన్నారు సీఎం.
https://twitter.com/htTweets/status/1532790708842598400?s=20&t=q9Wpm29i65pl9B2wR29R9g
బీకాన్గంజ్లో చెలరేగిన హింసకు సంబంధించి పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా.. దాడికి గురైన బాధితుల ఫిర్యాదు మేరకు మూడో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో తెలిసిన 40 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అదనంగా, ఈ కేసులో 1000 మంది గుర్తు తెలియని వ్యక్తులను కూడా నిందితులుగా చేర్చారు.
https://twitter.com/Uppolice/status/1532730625014128640?s=20&t=cbCZEk4eZgUm9HR6B9PqTg
“ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీకి చెందిన 12 కంపెనీలతో సహా అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపినట్లు.. ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు చేశామని.. సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామని.. వాటి ఆధారంగా నేరస్తులను గుర్తించి వారిపై గ్యాంగ్స్టర్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని” ADG (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు.
కాన్పూర్ హింస :
ప్రవక్తను దూషించారని ఆరోపిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు హత్య బెదిరింపులు వచ్చిన కొన్ని రోజుల తర్వాత, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో దానిపై జూన్ 3న తీవ్ర హింస చెలరేగింది. శర్మకు వ్యతిరేకంగా నిరసనగా ముస్లిం సమాజం ఈ ప్రాంతంలో బంద్కు పిలుపునిచ్చింది, శుక్రవారం ప్రార్థనల తర్వాత చేపట్టిన షట్డౌన్ హింసాత్మకంగా మారింది.
యతింఖానా సమీపంలోని బెకాన్గంజ్ ప్రాంతంలో ముస్లిం సమాజానికి చెందిన సభ్యులు రాష్ట్ర పోలీసులు, ఇతర పౌరులతో ఘర్షణ పడ్డారు, వాళ్లపై రాళ్లు విసిరారు. గత వారం శర్మ చేసిన ఆరోపణలకు నిరసనగా ముస్లిం నాయకుడు హయత్ జాఫర్ హష్మీ ‘మార్కెట్ బంద్’కు పిలుపునిచ్చిన తర్వాత వివాదం చెలరేగింది. జూన్ 3 న వందలాది మంది ముస్లింలు నిరసనలో చేరారు. శుక్రవారం నమాజ్ తర్వాత రాళ్లు విసరడం ప్రారంభించారు. హింసాకాండపై స్పందించిన పోలీసులు కొంతమంది ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. వారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా, రాళ్ల దాడి అడపాదడపా కొనసాగింది. నూపుర్ శర్మకు వ్యతిరేకంగా ఇస్లాంవాదులు ఊరేగింపు కూడా నిర్వహించారని, రెండు సార్లు కాల్పులు కూడా జరిగాయని నివేదికలు పేర్కొన్నాయి. హింసాకాండలో కనీసం ఆరుగురు గాయపడ్డారు.