కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కన్నా పార్టీ కండువా కప్పుకున్నారు. కన్నాకు పార్టీ శ్రేణులు సాదరస్వాగతం పలికారు. ఆయనతో పాటు కన్నా కుమారుడు, గుంటూరు మాజీ మేయర్ నాగరాజు, తాళ్ల వెంకటేష్ యాదవ్, మాజీ ఎంపీ లాల్ జాన్ బాషా సహా పెద్దసంఖ్యలో ఆయన అనుచురులు కూడా టీడీపీలో చేరారు.అంతకుముందు గుంటూరులో తన నివాసం నుంచి 3వేలమంది కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జులు కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు.
టీడీపీలో చేరిన కన్నా – కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు – కన్నాను సాదరంగా ఆహ్వానించిన పార్టీ శ్రేణులు
Share: