జేఎన్యూ మాజీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్, గుజరాత్ దళిత నేత జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్ను కలిసి, పార్టీలో చేరారు. కన్హయ్య కుమార్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సీపీఐలో చేరారు. బీహార్లోని తన హోమ్టౌన్ బెగుసరాయ్ నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. జిగ్నేష్ మేవాని గుజరాత్ లోని వడ్గాం ఎమ్మెల్యేగా ఉన్నారు.