మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కామారెడ్డిలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. సాగుభూములను మాస్టర్ ప్లాన్ జోన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు పట్టణంలో బంద్ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి. ఇప్పటికే దాదాపు 600మంది రైతులు కోర్టు నుంచి నోటీసులు పంపారు. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసి గవర్నర్ కు,ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి, పురపాలక మంత్రికి పంపారు రైతులు. గురువారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించిన రైతులు కలెక్టర్ వచ్చి వినతిపత్రం తీసుకోకపోవడంపై రైతులు ఆందోళన ఉధృతం చేసిన సంగతి తెలిసిందే.