దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. వివిధ రాష్ట్రాలలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కెట్టారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది మరియు దేశ రక్షణలో నిమగ్నమైన సైనిక సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్ లను ఉంచుతారు. ఈ లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎం మెషిన్లలోని ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటగా వస్తున్న ఓట్ల సరళని బట్టి చూస్తుంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బిజెపి సత్తాని చాటుకుంటుంది.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించిన ఫలితాలే వస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బిజెపి సమానంగా ఆదిత్య తను కనపరుస్తున్నాయి అటు ఆంధ్రప్రదేశ్లో బిజెపితో జత కలిసిన తెలుగుదేశం జనసేన కూటమి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది ఏపీలో అసెంబ్లీ స్థానాల్లో టిడిపి కూటమి పై చేయి సాధిస్తోంది