కల్వకుంట్ల ఆడబిడ్డకు మరో నజరానా?
బంగారు తెలంగాణలో కల్వకుంట్ల దొరగారి కుటుంబం పంట పండింది. దొర సీఎం అయ్యాడు. కొడుకు, మేనల్లుడు మంత్రులయ్యారు. కూతురు ఎంపీగా ఓడిపోయినా ఎంఎల్ సి అనే పదవిని ఆడబిడ్డ కట్నం ఇచ్చినట్టు అప్పగించారు. మంత్రి పదవి కూడా వస్తుందని ప్రచారం జరిగినా అది ఇంకా పెండింగులో ఉంది. ఇక ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షురాలి పదవి కవితకు రాబోతుందనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. అంటే ఆర్టీసీ కార్మికుల జీవితాలను ఉద్ధరించే అవకాశం ఆమెకు వస్తుందేమో. ఇప్పటికే సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా అక్కడి కార్మికుల జీవితాలను ఆమె బాగానే ఉద్ధరించినట్టున్నారు. అందుకే బోనస్ గా ఆర్టీసీ యూనియన్ మీద పెత్తనం అప్పజెప్తరేమో.
ఆ మధ్య ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో యూనియన్ల మీద సీఎం దొర నిప్పులు చెరిగారు. వాటిని రద్దు చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో కార్మిక సంఘాలు భాగమనే ఆలోచన లేకుండా యూనియన్ నేతల మీద ఆగ్రహం వెళ్లగక్కారు. ఇప్పుడు అదే యూనియన్ కవిత గౌరవాధ్యక్షతన కార్మికులకు సకల సౌకర్యాలు సమకూర్చే పరిస్థితి వస్తుందా?
తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని ఎవరన్నారు? కల్వకుంట్ల దొరగారి ఇంట్లో వద్దంటే కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది మనకు గర్వ కారణం కాదా!!