అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ తండ్రి చితికి నిప్పుపెట్టారు. ఉదయం ఫిల్మ్నగర్లోని కైకాల నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది . అంత్యక్రియల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని కైకాలకు కన్నీటి వీడ్కోలు పలికారు.