మార్చ్ 31, 2022 కి అంతమయ్యే ఆర్ధిక సం.కి ప్రపంచ ఆర్ధిక రేటింగ్ దిగ్గజాలు ప్రకారం భారత్ అభివృద్ధి రేట్ అంచనాలు:
IMF:11.5%,
NOMURA :13.5%,
MOODY:13.7%,
Goldman Sachs: 13%
2022 సం. కి భారత్ GDP అభివృద్ధి ఈ సంస్థల అంచనాల్లో ఒక శాతం అటూ ఇటూగా వున్నా దాదాపు రేటింగ్ ఏజెన్సీస్ అన్ని మాత్రం 2022 లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నెంబర్ వన్ స్థానం లో ఉంటుంది అని గట్టిగా అంచనా వేస్తున్నాయి.
అలాగే గత 5 నెలలుగా ప్రతీ నెలా GST వసూళ్లు ఒక లక్ష కోట్లకు తగ్గకుండా వసూలు అవ్వడమే కాదు ప్రతీ నెలా పెరుగుదల కూడా నమోదు చేసుకుంటున్నాయి.
పారిశ్రామిక ఉత్పత్తి రంగ సూచి 57.5%తో ఫిబ్రవరి నెల మంచి అభివృద్ధి నమోదు చేసుకుంది.
గత సంవత్సరం ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఎగుమతులు సుమారు 5.7% వృద్ధి నమోదు చేశాయి. అలాగే ముఖ్య వస్తువుల దిగుమతులు కూడా 16% పెరిగి దేశంలో వినియోగం పెరుగుతున్న విషయం ధృవీకరిస్తున్నాయి.
దేశంలో ఫారెన్ ఎక్స్చేంజి నిల్వలు రికార్డ్ స్థాయిలో అంటే సుమారు $584 బిలియన్ దాలర్లుగా ఉన్నాయి. అంటే ₹43.21 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి.
కోవిడ్ వల్ల ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి రేట్ పడిపోతే మోడీ చేతకాని ఆర్ధిక విధానాల వల్ల
భారత్ ఆర్ధిక వ్యవస్థ నాశనం అయిపోయింది అని గోల గోల చేసిన ఫేస్ బుక్ యూనివర్సిటీ మేధావులు గత కొద్ది రోజులుగా భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడే అవస్థ పడ్డం మానేశారు.
రైతు ఉద్యమం, దిశా గొడవ, పెట్రోల్ ధరల గొడవ దాదాపు చల్లారాయి. ఇక కొన్నాళ్ళు మోడీ స్టేడియం మీద రీసెర్చ్ చర్చలు చేస్తారు.
వీటిని సామాన్య ప్రజలు పట్టించుకోలేదు అనడానికి రుజువుగా అన్నట్లు మొన్న జరిగిన గుజరాత్ పంచాయితీ, నగర పాలిక, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎప్పుడూ గెలవని గ్రామ సమితుల్లో కూడా సీట్లు గెలిచింది. అన్ని జిల్లా, నగర పాలిక సంస్థలను కైవసం చేసుకుంది. రైతు ఉద్యమం, పెట్రో ధరల పెరుగుదలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, ఆప్ పార్టీలు పూర్తిగా మట్టి కరిచాయి.
పై సమస్యలు చల్లారుతున్నాయి అనే లోగా ఏ ఉమ్మడి పొరస్మృతి అదే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్, లేదా జనాభా నియంత్రణ బిల్లు ప్రభుత్వం తీసుకువస్తే ప్రతిపక్షాలు ఇవన్నీ పక్కన పడేసి ఆ బిల్లులను మైనార్టీ హక్కుల మీద దాడిగా వర్ణిస్తూ ఆందోళనలు చేస్తారు.
రాబోయే ఎన్నికలకు మోడీకి మరికొన్ని అస్త్రాలు
ఇస్తాయి విపక్షాలు.
సాధారణంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద అస్త్రాలు సిద్ధం చేసుకుంటాయి. కానీ అదేంటో మోడీయే ప్రతిపక్షాలకు, మేధావులకు అస్త్రాలు ఇచ్చి చర్చ వాటి చుట్టూ జరిగేటట్లే చూసుకుంటాడు. అంటే మనకి అనుకూలంగా తయారుచేసుకున్న పిచ్ మీద విదేశీ ఆటగాళ్లు బౌలింగ్ చెయ్యడం లాగ అన్నమాట.
అదొక టెక్నిక్.