సుప్రీం కోర్టు తదుపరి న్యాయమూర్తిగా జస్టిస్ వైఎస్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. 50వ సీజైఐగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను న్యాయశాఖకు పంపనున్నారు. తరువాత కేంద్ర న్యాయశాఖ భారత ప్రధానికి పంపుతుంది. ప్రధాని రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి అనుమతి తరువాత కొత్త న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ పదవీకాలం ఈనెల 8తో ముగియనుంది. పదవీ విరమణ చేసేవాళ్లు అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సిఫార్సు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం లలిత్ తరువాత సీనియర్ జస్టిస్ చంద్రచూడే. అందుకే ఆయన పేరును ప్రతిపాదించారు జస్టిస్ లలిత్. చంద్రచూడ్ రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. మహారాష్ట్రలో జన్మించిన చంద్రచూడ్ తండ్రి విష్ణు చంద్రచూడ్ సైతం సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా పనిచేయడం విశేషం.