వ్యక్తిగత సిబ్బందిని వినియోగించుకోవడంలో రికార్డ్ సృష్టించారు జస్టిస్ యూయూ లలిత్.
CJIగా పని చేసిన కాలంలో 40 మందికిపైగా ప్యూన్లు, ఇతర సిబ్బంది సేవలను పొందారు. సీజేఐగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన నివాసం వద్ద దాదాపు 28 మంది సపోర్ట్ స్టాఫ్ సేవలను పొందుతున్నారు. సాధారణంగా న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని మాత్రమే ఉపయోగించుకుంటూ ఉంటారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27 నుంచి నవంబరు 8 వరకు సీజేఐగా పని చేశారు. ఆ కాలంలో ఆయన నివాసం 19, అక్బర్ రోడ్లో 40 మందికిపైగా ప్యూన్లు, ఇతర సిబ్బంది పని చేసేవారు. రాష్ట్రపతి భవనం, ప్రధాన మంత్రి కార్యాలయం మినహా ఇతర రాజ్యాంగ పదవులను నిర్వహించేవారి నివాసాల వద్ద ఇంత ఎక్కువ మంది పని చేయడం చాలా అరుదు.