ఢిల్లీ మద్యంస్కాంలో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ దరఖాస్తుపై మార్చి 31న తీర్పు చెబుతామని ఢిల్లీ కోర్టు తెలిపింది. సిసోడియాకు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ దాఖలు చేసిన పత్రాల నకళ్లను, కేసు డైరీ, కొందరు సాక్షుల స్టేట్ మెంట్లనూ అందుబాటులో ఉంచింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే దాదాపు 11 మంది అరెస్టయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కేసులో అనుమానితురాలని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఆమెను ఇప్పటికే మూడుసార్లు ప్రశ్నించాయి.