యాదాద్రి ఈవో గీత తీరు తమను అవమానించేలా ఉందంటూ జర్నలిస్టులు ధర్నాకు దిగారు. ఇటీవల మీడియాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ ఘాట్ రోడ్డు దగ్గర జర్నలిస్టులు శాంతియుత నిరసనకు దిగారు. అయితే కనీసం వారి మాట కూడా వినే ప్రయత్నం చేయకుండా… పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించారు గీత. దీంతో ఈవో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదాద్రి పోలీస్ స్టేషన్ ఎదుట వారంతా ఆందోళనకు దిగారు. జర్నలిస్టులకు సంఘీభావంగా స్థానిక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఐ నేతలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని, గుట్టపైకి జర్నలిస్టుల వాహనాలను అనుమతించాలని వారు డిమాండ్ చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)