వివాదాస్పద జర్నలిస్ట్ రాణా ఆయూబ్ పై మరో కేసు నమోదైంది. ఉడిపి కళాశాలలో హిజాబ్ కు వ్యతిరేకంగా కాషాయ కండువాలతో నిరసన తెలుపుతున్న విద్యార్థులను హిందూ ఉగ్రవాదులు అన్నందుకు ఆమెపై పలువురు ఫిర్యాదు చేశారు. బాంబే హైకోర్ట్ లాయర్ అశుతోష్ జె దుబే కూడా రాణాపై కేసు పెట్టారు. హిజాబ్ వివాదంపై బీబీసీ జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్నాటక కాలేజీ కాషాయ కండువాలతో హిందూ టెర్రరిస్టులు ఎందుకు ఆందోళన చేసినట్టు అని ఆమె విరుచుకుపడింది. మగ పిల్లలు మెడలో కాషాయ కండువాతో వస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆమె ప్రశ్నించారు. ఇలా హిందూ ఉగ్రవాదం అంటూ విద్యార్థులపై ముద్ర వేయడం ద్వారా రాణా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆశుతోష్ ఫిర్యాదు చేశారు. బాంద్రాలోని గ్రేటర్ ముంబై పోలీసులకు చేసిన ఆన్లైన్ ఫిర్యాదులో….ఆమె ఉద్దేశపూర్వంగానే కాషాయ జెండాలు పెట్టుకున్నవాళ్లను హిందూ ఉగ్రవాదులన్నారు. అవి కచ్చితంగా విద్వేషపూరిత వ్యాఖ్యలే అని ఫిర్యాదు చేశారు.
కోవిడ్ సర్వీస్ కోసం విరాళాల పేరుతో రాణా… కోట్లాది రూపాయలు వసూలు చేసి సొంతంగా వాడుకున్న సంగతి తెలిసిందే. అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ ఆమె ఆస్తులను కూడా అటాచ్ చేసింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)