బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రబీజేపీ కేడర్లో జోష్ నింపుతోంది. కాస్త విరామం తరువాత పార్టీలోకి భారీఎత్తున వలసలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాకు చెందిన డా. కె మల్లికార్జన రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్న సంజయ్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా అలంపూర్లో ఆయన సమక్షంలోనే బీజేపీలో చేరారు మల్లికార్జున రెడ్డి. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అబద్ధపు మాటలతో ప్రజల్ని మోసం చేస్తున్న టీఆర్ఎస్ సర్కారును గద్దెదింపడం బీజేపీ వల్లే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
2018 వరకూ మల్లికార్జున రెడ్డి బీజేపీలోనే ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికోసం పనిచేశారు. అయితే ఆయన ఆశించిన మేరకు టికెట్ రాకపోవడంతో పార్టీ మారారు. టీఆర్ఎస్ లో చేరారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడుపుతున్న మోదీమీద అభిమానంతో తిరిగి పార్టీలో చేరినట్టు ఆయన చెప్పారు. ఇంతకుముందు పనిచేసిన పార్టీలో చేరడం ద్వారా పుట్టింటికి చేరిన అనుభూతి కలుగుతోందని అన్నారు. మల్లికార్జున రెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటీ రమాదేవి తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు, కార్యదర్శులు గంగాధర్ సహా మెడ్సేం రాజు అధ్వర్యంలో, మురళి నాయుడు, నరేందర్ బరుకుంట, శశి రాజ్ వర్మ, శేకర్ మైసా, లక్కడీ శ్రవణ్ రెడ్డి , గంగాధర్, శైలేశ్వర, ఎం ఎస్ రెడ్డి, భారత్ నారాయణ, నరేష్ ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)