2021-22 సంవత్సరానికి గానూ.వివిధ శాఖలకు చెందిన 10,143 పోస్టులను భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం.పోస్టుల భర్తీలో భాగంగా జూలైలో 1238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనుంది.
ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-1, 2కు చెందిన 36 పోస్టులకు నోటిఫికేషన్ ఉంటుంది.సెప్టెంబర్ లో పోలీసు శాఖలో 450 పోస్టులను భర్తీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించిందిశ
అక్టోబర్ లో వైద్యశాఖలో 451 పోస్టులు,నవంబర్ లో వైద్యశాఖలోని 5251 పారా మెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనుంది.
డిసెంబర్ లో 441 నర్సుల పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది.
వచ్చే యేడాది జనవరిలో 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులు,2022 ఫిబ్రవరిలో వివిధ వర్సిటీల్లోని 2 వేల అసిస్టెంట్ పోస్టుల భర్తీని చేపట్టనుంది.
ఇక
2022 మార్చిలో వివిధ శాఖలకు చెందిన 36 పోస్టులు భర్తీకానున్నాయి.