ఝార్ఖండ్ ఫలితాలు విచిత్రంగా మారుతున్నాయి. ఉదయం నుంచి దోబూచులాట కొనసాగింది. ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతూ వచ్చాయి. నువ్వా నేనా అన్నట్లు ఎన్డీయే, ఇండీ కూటములు పోటీ పడుతూ వచ్చాయి. ఫలితాలు మొదలైనప్పుడు ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కనిపించినా.. ఆ తర్వాత అనూహ్యంగా ఇండీ కూటమి పలు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొచ్చింది. దీంతో నెంబర్ గేమ్ లో.. రెండు కూటములు పోటీ పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం స్వతంత్య్ర అభ్యర్థులే కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు ఝార్ఖండ్ లో తెరలేచినట్లైంది. జేఎంఎం కూటమి పట్టు పెంచుతూ వచ్చింది.