జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నిన్న పహల్గామ్ బస్సు ప్రమాదంలో మరణించిన ITBP జవాన్ల పార్థివ దేహాన్ని మోసుకెళ్ళారు. ఈ దృశ్యాలను చుసిన వారు భావోద్వేగానికి గురవుతున్నారు.
https://twitter.com/ANI/status/1559775312355143682?s=20&t=74Qdp6aeMNryEl3vH2goPA
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన ఏడుగురు జవాన్లు జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో వారిని తీసుకువెళుతున్న బస్సు నదిలో పడిపోవడంతో మరణించారు. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. బస్సులో 39 మంది సిబ్బంది ఉన్నారు, వీరిలో 37 మంది ITBP.. ఇద్దరు J&K పోలీసులు ఉన్నారు. చందన్ వారిలోని జిగ్ మోర్ ఫ్రిస్లాన్ వద్ద బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది.
మృతులను హెడ్ కానిస్టేబుల్ దులా సింగ్, కానిస్టేబుల్ లు అభిరాజ్, అమిత్, డి రాజ్ శేఖర్, సుభాష్ సి బైర్వాల్ గా గుర్తించారు.