ఇస్లాంను విడిచిపెట్టి, హిందూ మతాన్ని స్వీకరించిన మాజీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ త్యాగికి పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విదేశాల నుంచి ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు వసీం రిజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగి లేఖ రాశారు. దుబాయ్ నంబర్ (+971569781862) నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని హిందీలో రాశారు. ఉగ్రవాది ఇక్బాల్ కస్కర్ సోదరుడిగా చెప్పిన వ్యక్తి రాబోయే మూడు రోజుల్లో తల నరికివేస్తానని తనను హెచ్చరించాడని తెలిపారు.
ఇక్బాల్ కస్కర్, గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు. దావూద్, అతని సహాయకులపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జైలుకు పంపింది.
త్యాగి ఇస్లాం గురించి కొన్ని వాస్తవాలను వెల్లడించినప్పటి నుంచి చాలా మంది రాడికల్ ఇస్లామిస్ట్లు అతన్ని వేధిస్తున్నారని ఆయన తెలిపారు.
గతేడాది ఉత్తరప్రదేశ్లో వసీమ్ రిజ్వీ హింసను ప్రోత్సహించే 26 శ్లోకాలను తొలగించి, మిగిలిన శ్లోకాలను సరైన క్రమంలో అమర్చడం ద్వారా ‘కొత్త ఖురాన్’ను రూపొందించారు. దేశంలోని అన్ని మదర్సాలు, ముస్లిం ఇన్స్టిట్యూట్లలో తన ‘కొత్త ఖురాన్’ను ఉపయోగించేందుకు అధికారం ఇవ్వాలని రిజ్వీ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
వసీం రిజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగి గతంలో చేసిన అనేక వ్యాఖ్యలు, ఇస్లాంను త్యజించి హిందూమతాన్ని స్వీకరించాలన్న నిర్ణయమైనా లేదా ‘కొత్త ఖురాన్’ను రూపొందించాలన్నా.. ఆయన ధర్మసంసద్లో ‘రెచ్చగొట్టే’ ప్రసంగాలకు.. హింసను ప్రోత్సహించే 26 శ్లోకాలను తొలగించడం ద్వారా భారతదేశంలో ఇస్లాంవాదుల్లో తీవ్ర వ్యతిరేకం ఏర్పడింది.