సన్యాసికి రాజకీయాలెందుకని విమర్శించారు. మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోశారు. ఒకట్రెండు మరణాల్ని చూపుతూ శవరాజకీయాలు చేశారు. కానీ ఇవేవీ ప్రజలు పట్టించుకోలేదు. జిస్నే రేషన్ బేజా, సురక్షా దీ….ఓట్ ఉస్ కో…మోదీ, యోగీ భూకే నహీ మర్నే దియా …మాకు రేషన్ ఇచ్చారు, రక్షణ ఇచ్చారు. మోదీ, యోగీ ఎవర్నీ ఆకలితో చావనివ్వలేదు.. వారికే మా ఓటు అంటూ అద్భుత తీర్పునిచ్చింది యూపీ. కులమతాలకు అతీతంగా రెండోసారీ యోగీ వెంట నిలిచారు ప్రజలు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)