ఈ దీపావళినాటికి దేశంలోని ముఖ్యనగరాల్లో జియో 5 జి నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముకేశ్ అంబానీ. డిసెంబర్ 2023 నాటికి దేశంలోని ప్రతి పట్టణానికి 5జీ నెట్వర్క్ను విస్తరిస్తామన్నారు. నెట్వర్క్ విస్తరణకుగానూ రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు. డిజిటల్ కనెక్టివిటీ నెట్వర్క్ రూపకల్పనకు రిలయన్స్ జియో మరో ముందడుగు వేస్తోందని, అదే ’జియో 5జీ’ అని అంబానీ వ్యాఖ్యానించారు. స్మార్ట్ హోం సొల్యూషన్స్తో దేశంలోని 10 కోట్ల ఇళ్లకు 5జీ నెట్వర్క్ ద్వారా అనుసంధానమవ్వబోతున్నామన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 45వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ ఈ ప్రకటన చేశారు.
భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సొల్యూషన్ సర్వీసులు అందించగలమని ముకేష్ అంబానీ దీమా వ్యక్తం చేశారు. తద్వారా జియో 5జీ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన 5జీ నెట్వర్క్గా అవతరించనున్నామని అంబానీ అన్నారు. 5జీలో లేటెస్ట్ వెర్షన్గా పిలిచే ‘స్టాండ్ -అలోన్ 5జీ’ అని చెప్పారు. ‘స్టాండ్ -అలోన్ 5జీ’లో ప్రస్తుత 4జీ సర్వీసులపై ఏమాత్రం ఆధారపడబోమన్నారు. ‘స్టాండ్ -అలోన్ 5జీ’ విధానంలో లార్జెస్ట్, మిక్స్ ఆఫ్ స్పెక్ట్రమ్, క్యారియర్ అగ్రెగేషన్గా పిలిచే మూడంచెల ప్రయోజనాలు ఉంటాయి.
Jio will deploy the latest version of 5G called 'standalone 5G'. To build a pan-India true 5G network, Jio will invest Rs 2 lakh crores: Akash Ambani, chairman, Reliance Jio pic.twitter.com/b1Igqwe3I5
— ANI (@ANI) August 29, 2022