2017 నాటి ఓ కేసులో జిగ్నేష్ మేవానికి గుజరాత్ కోర్టు మూడునెలల జైలు శిక్ష విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఉనా ప్లాగింగ్ ఘటనను నిరసిస్తూ ఐదేళ్ల క్రితం ఫ్రీడమ్ మార్చ్ పేరుతో నిరసన తెలిపారు మేవాని. మేవానీతోపాటు..ఎన్సీపీ నేత రేష్మా పటేల్ కు కోర్టు జైలు శిక్ష వేసింది. వీరితోపాటు సుబోధ్ పర్మార్ను కూడా నిందితుడిగా తేల్చింది. వీరు కాక మరో ఎనిమిదిమందికీ జైలు శిక్ష విధించిన కోర్టు.. 1000 రూపాయల జరిమానా వేసింది.
ప్రధాని మోదీపై అనుచిత ట్వీట్లు చేశారనే ఆరోపణలతో అసోం పోలీసులు మేవానీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత వారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఇలా విడుదలయ్యారో లేదో, మహిళా పోలీసు అధికారిపై దాడి చేసిన ఆరోపణలతో మేవానిని మరోమారు అరెస్ట్ చేశారు. జిగ్నేష్కు రెండో కేసులోనూ బెయిలు మంజూరైంది. శనివారం ఆయన కోక్రాఝర్లోని కోర్టులో బెయిల్ ఫార్మాలిటీలను పూర్తి చేశారు. ఇప్పుడిక పాత కేసులో ఆయన జైలుకు వెళ్లబోతున్నారు.