ఆదివారం నాటి మోదీ మాధేరా సభకు జనం లేరు. అన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నై. సొంత రాష్ట్రంలో ప్రధానికి ప్రజాదరణ కరవువుతోంది. ఆమ్ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరై ప్రశాంత్ భూషణ్ మరోసారి ఫేక్ వీడియోతో ప్రచారం చేస్తున్న వార్తఇది. సోమవారం ట్వీట్ చేస్తూ ఓ వీడియో క్లిప్ షేర్ చేశారు. గుజరాత్ లో మోదీకి ప్రజాదరణ తగ్గుతోంది. ఇదిగో నిదర్శనం అంటూ రాసుకొచ్చారు. అందులో ఖాళీ కుర్చీలను చూపిస్తున్న దృశ్యాలు. దేశప్రధానికి సొంతరాష్ట్రంలో పెరుగుతున్న ప్రజాదరణ అంటూ వ్యంగ్యంగా కామెంట్. వెంటనే ఆ ట్వీట్ ను షేర్ చేశాడు కాంగ్రెస్ నేత జిగ్నేష్ మేవానీ. మేవానీ ఒక్కడే కాదు మోదీని వ్యతిరేకించే ట్విట్టర్ వినియోగదారులంతా ఆ వీడియోను షేర్ చేశారు.
https://twitter.com/pbhushan1/status/1579328992272076800?s=20&t=e3aOSeXmEVihdoLZ60WPBg
https://twitter.com/jigneshmevani80/status/1579324102841880576?s=20&t=ayXZZvGhfNy4L2Zw5OoKaQ
అందరూ ఒకే రకంగా ప్రధాని మోదీకి ఇంతపెద్దఎత్తున ప్రజాదరణ అనేది దాని సారాంశం. ఉన్ కా బఢ్తీ లోకప్రియతా అని హిందీలో వ్యంగ్యంగా రాస్తూ షేర్ చేస్తున్నారు కాంగ్రెస్ కేడర్, మోదీ వ్యతిరేకులు. అంటే ఈ స్థాయిలో పెరుగుతున్న ప్రజాదరణ అని అర్థం. అంటే ఓ టూల్ కిట్ క్రియేట్ అయిందన్నమాట.
అసలైతే ఆ వీడియో పూర్తిగా ఫేక్ అని తేలింది. సభ ముగిసిన అందరూ తిరిగివెళ్లిపోయిన తరువాత ఖాళీ కుర్చీల విజువల్స్ ను ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు.
అసలైతే మోదీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తే అది ఫేక్ అని స్పష్టమవుతోంది. మోదీ మాట్లాడుతూ…మధేరాలోని సూర్య దేవాలయం, బహుచారాజీ దగ్గరి తీర్థం, ఉమియా మాతా, రాన్ కీ వావ్, తరంగా హిల్, రుద్రమహాలయ్, వాద్నగర్ కోరన్ మొదలైనవాటిని బస్సుల్లో వెళ్లి సందర్శించవచ్చు అన్నారు. దీంతో అక్కడున్నవాళ్లంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
మోదీ ప్రసంగం ముగిసిన తరువాతకూడా కెమెరా జనంవైపు మళ్లించినప్పుడు సభాస్థలం మొత్తం జనంతో నిండిపోయినట్టే కనిపిస్తోంది. మోదీ ప్రసంగం ముగిసిన తరువాత ఎవరో ఎడిట్ చేసిన వీడియోను వాళ్లు వైరల్ చేస్తున్నట్టు తేలింది. దీంతో బీజేపీ మద్దతుదారులు మేవానీ అండ్ కో కౌంటర్లివ్వడం మొదలు పెట్టారు. గతంలో కూడా మేవానీ, భూషణ్ లు కరోనా వ్యాక్సిన్ పై తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేశారని గుర్తు చేస్తూ మండిపడుతున్నారు.