జార్ఖండ్ దేవ గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే ప్రమాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది.
దాదాపు 45 గంటలు శ్రమించి నలభై మందిని కాపాడింది రెస్క్యూ టీం. అయితే ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరడం విషాదం. ప్రమాదసమయంలోనే ఇద్దరు చనిపోయారు. సోమవారం ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కాపాడే ప్రయత్నంలో ఓ వ్యక్తి పట్టుతప్పి జారి కిందపడి మరణించగా…ఇవాళ మరో మహిళ అలాగే జారికిందపడి చనిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలను భారత వైమానిక దళం అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది.
https://twitter.com/IAF_MCC/status/1513502133257404417?s=20&t=zr8GX-5ptBfNXto4fffPHg
ఆదివారం పర్యాటకులు 766 మీటర్ల పొడవైన వర్టికల్ రోప్ వేలో విహరిస్తుండగా…సాంకేతిక లోపం వల్ల రెండు వైర్లు ఢీకొన్నాయి. సమాచారం అందిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు. ఇంకా ఆర్మీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్లో కలిసి పనిచేశాయి. కేబుల్ కార్లలో చిక్కుకున్న వారికి ఆహారం, నీళ్లు అందిస్తూనే… ఒక్కొక్కరిని వాటినుంచి క్షేమంగా బయటపడేశారు రెస్క్యూ సిబ్బంది. నిన్న రాత్రిపడడంతో సహాయక చర్యలు నిలిపేసి…మంగళవారం మధ్యాహ్నం మళ్లీ కొనసాగించారు. ఈ ప్రమాదాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. హైకోర్టు సైతం సుమోటాగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
https://twitter.com/IAF_MCC/status/1513747435746586626?s=20&t=zr8GX-5ptBfNXto4fffPHg