
File Photo
బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి సవాల్ విసిరారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. చట్టవిరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ ఆయనకు సమన్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 11 గంటలకు రాంచీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లలో పేర్కొంది. అయినా ఆయన హాజరుకాలేదు. అయితే ఈడీ సమన్లపై స్పందించేందుకు న్యాయసలహా తీసుకుంటున్నట్టు పార్టీ తెలిపింది.
దీనిపై మీడియా అడగ్గా సోరేన్ ఫైరయ్యారు. తాను ఓముఖ్య కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని…అంతపెద్ద నేరం చేసి ఉంటే అరెస్ట్ చేయండి, ప్రశ్నించడం ఎందుకు అని ఆయన కేంద్రాన్నినిలదీశారు. ఈడీ కార్యాలయం దగ్గర ఎందుకు భద్రత పెంచారని… జార్ఖండీలంటే ఎందుకు భయపడుతున్నారనీ హేమంత్ ప్రశ్నించారు.
https://twitter.com/ANI/status/1588099047046250496?s=20&t=qy8BDIXTtNBd6J8TPbKqCA