కొంతకాలంగా నితీశ్ తో సై అంటే సై అంటున్న జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహా ఆయనకు ఝలక్ ఇస్తూ పార్టీని వీడారు. జేడీయూకు రాజీనామా చేసిన ఆయన ‘రాష్ట్రీయ లోక్ జనతా దళ్’ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త పార్టీకి తాను జాతీయ అధ్యక్షుడిగా ఉంటానని, కర్పూరి ఠాకూర్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. అంతకుముందు సన్నిహితులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
నితీష్తో విభేదాలువెళ్తూవెళ్తూ నితీష్ పై కుష్వాహా తీవ్ర విమర్షలే చేశారు. నితీష్ తీరుపట్ల పార్టీలో చాలామంది అసంతృప్తిగా, ఆందోళనగా ఉన్నారని అన్నారు. మొదట్లో నితీశ్ బాగానే ఉన్నారని..రాన్రానూ ఆయన తీరు సరిగా ఉండడం లేదన్నారు. ఆయన ఎంచుకున్న మార్గం వల్ల ఆయనకే కాక బిహార్ కు నష్టం కలిగించనుందన్నారు.
62 ఏళ్ల కుష్వాహా 2021లో తన పార్టీ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీని జేడీయూలో విలీనం చేశారు. అయితే ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసిన నితీష్… తేజస్వియాదవ్ కు తన మంత్రి వర్గంలో డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టినప్పటినుంచి కుష్వాహా వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని నితీష్ మాట మార్చాడని సన్నిహితులతో చెప్పుకుని వాపోయారు. ఇక ఇటీవల ఢిల్లీలో బీజేపీ నేతలను కుష్వాహా కలిసినట్టు ఫొటోలు బయటకు వచ్చాయి. తరచూ కుష్వాహా బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నితీష్ సైతం కుష్వాహాను పట్టించుకోనట్టే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
https://twitter.com/ANI/status/1627592599426174978?s=20