భారతదేశ నాయకత్వం మీద విదేశాల్లో నమ్మకం అంతకంతకు పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తుంది అని విదేశీ సంస్థలు సైతం అంచనా వేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ సంకల్పం పెట్టుకున్నారు. ఇందుకు తగినట్లుగా భారత ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు.
ఈ ప్రయత్నాలకు విదేశాల నుంచి సైతం చక్కటి స్పందన లభిస్తోంది. భారతీయ మార్కెట్లలో విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిదారులు విస్తారంగా కొనుగోళ్లు జరుపుతున్నారు.
జూలై మొదటి వారంలో ఎఫ్పిఐలు దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ ఏడాది మొత్తం మీద విదేశీ పెట్టుబడులు రూ. లక్ష కోట్లకు పెరిగాయి.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లి మిటెడ్ (ఎన్ఎస్డిఎల్) డేటా ప్రకారం, జూలై మొదటి వారంలో ఎఫ్పిఐల ద్వారా భారతీయ ఈక్విటీల్లో మొత్తం కొనుగోళ్లు రూ.7,962 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు జూన్ నెలలో ఎఫ్పిఐలు రూ.25,565 కోట్ల విలువైన భారతీయ షేర్ల ను కొనుగోలు చేశారు. గత మూడు వారాల్లో విదే శీ ఇన్వెస్టర్ల వైఖరిలో మార్పు వచ్చింది. అంతకు కొంతకాలంగా ఎఫ్పిఐలు అమ్మకందారులుగా ఉన్నారు. మే నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.25,586 కోట్ల విలువైన భారతీయ షేర్లను సేల్ చేశారు.
కాగా ఏప్రిల్లో ఎఫ్పిఐలు రూ.8,671 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ విధంగా వరుసగా 2 నెలల అమ్మకాల తర్వాత ఎఫ్పిఐలు మళ్లీ భారతీయ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు.
ఎన్ఎస్డిఎల్ డేటా ప్రకారం, 2024లో ఎఫ్పిఐ మొత్తం పెట్టుబ డి ఇప్పుడు రూ.1,09,934 కోట్లకు చేరుకుంది.
మొత్తం మీద భారత్ ఆర్థిక వ్యవస్థ మీద విదేశాల్లో నమ్మకం పెరుగుతోంది. స్టాక్ మార్కెట్ లు కళ కళ లాడుతున్నాయి.