తీవ్రవాద సంస్థలతో పనిచేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఎటువంటి విచారణ లేకుండా జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిని తొలగించారు. ప్రభుత్వం తొలగించిన వారిలో ముహీత్ అహ్మద్ భట్ (కశ్మీర్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్త), మాజిద్ హుస్సేన్ ఖాద్రీ (కశ్మీర్ విశ్వవిద్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్), సయ్యద్ అబ్దుల్ ముయీద్ (ఐటీ, జెకెఇడిఐ మేనేజర్) సహా జెకెఎల్ఎఫ్ అగ్ర ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే సతీమణి అస్సాబా-ఉల్-అర్జామంద్ ఖాన్ (డైరెక్టరేట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, కశ్మీర్)లు ఉన్నారు. వీళ్లంతా రాష్ట్ర భద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో పాల్గొంటున్నారని వారిని తొలగించారు.