నిషేధిత ఇస్లామిక్ సంస్థ జమాతే ఇస్లామీ (JeL)కి చెందిన ఫలాహ్-ఏ-ఆమ్ ట్రస్ట్ (FAT) ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో విద్యాబోధన నిలిపివేయాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈవిషయంలో కఠినంగా ఉండాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించింది. 15 రోజుల్లో అన్ని పాఠశాలలను మూసివేయాలని.. విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించాలని అధికారులను ఆదేశించింది. జమ్మూ కశ్మీర్ పోలీసుల స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA ) దర్యాప్తు ప్రకారం FAT ప్రభుత్వ భూములను ఆక్రమించింది. FATను 1972లో స్థాపించారు.జమాత్-ఇ-ఇస్లామీ అనే ఇస్లామిక్ సంస్థతో అనుబంధంగా ఉంది. ఆ సంస్థను 2019లోనే నిషేధించారు.
Educational institutions run by Falah-e-Aam Trust (FAT), an affiliate of the banned Jamat-e-Islami org, to be sealed within 15 days.
All students studying in such institutions will enroll in nearby govt schools. No new admission to be taken & registrations to be done: J&K Govt pic.twitter.com/oNHgXNxxIh
— ANI (@ANI) June 15, 2022
మొత్తం 300కి పైగా ఉన్న అన్ని FAT పాఠశాలలు ప్రభుత్వం అక్రమంగా తీసుకున్న స్థలాల్లో నిర్మించారు. తుపాకులతో అధికారులను బెదిరించి… రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వాటిని లాక్కున్నట్టు తేలింది. ఫోర్జరీ సంతకాలతో కూడా పలు భూములను సొంతం చేసుకున్నారు.
“జమ్మూ కశ్మీర్ లోని ‘ఫలాహ్-ఏ-ఆమ్’ నిర్వహిస్తున్న పాఠశాలల్లో అన్ని విద్యా కార్యకలాపాలు వెంటనే నిలిపివేయాలి” అని పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ BK సింగ్ ఆదేశాలు జారీ చేశారు. “ఈ నిషేధిత సంస్థలలో చదువుతున్న విద్యార్థులందరూ ప్రస్తుత విద్యా సంవత్సరం, 2021-2022 కోసం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలి. అందరు CEOలు/ప్రిన్సిపల్స్/ZEOలు ఇందుకు కావల్సిన ఏర్పాట్లలో సహకరించాలి. ఇక ఈ నిషేధిత FAT సంస్థలలో కొత్త అడ్మిషన్ తీసుకోకూడదు, ఈ సంస్థల తదుపరి రిజిస్ట్రేషన్ చేయరాదు” ఆదేశాల్లో స్పష్టంగా ఉంది.
1990లో అప్పటి ప్రభుత్వం FATని నిషేధించింది. నిషేధాన్ని అనుసరించి విద్యార్థులు, ఉపాధ్యాయులలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారు. కొన్ని పాఠశాలలను FAT రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గ్రామ కమిటీలకు అప్పగించింది. ప్రస్తుతం కనీసం డజను FAT ఆధీనంలో ఉన్నాయి.