టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా జైనులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకునే క్రమంలో వారి ఆహార అలవాట్లపై ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. తమ మత విశ్వాసాలను దెబ్బతీసిన మొయిత్రా క్షమాపణ చెప్పాలని లేదంటే దావా వేస్తామని జైనులు హెచ్చరిస్తున్నారు. జైనులు అహ్మదాబాద్ వీధుల్లో రహస్యంగా మాంసాహారం తింటారని లోక్ సభలో మాట్లాడుతూ అన్నారు మహువా.
అసలైతే జైనులు పూర్తి సాత్వికాహారం తీసుకుంటారు. బంగాళాదుంపలు, ఉల్లి, వెల్లుల్లి వంటి భూమి లోపల పండే వాటినీ స్వీకరించరు. వాటిని భూమి నుంచి వేరు చేయడం వల్ల నేలలోని జీవులకు హాని కలుగుతుందని వాళ్లు భావిస్తారు. అలాంటిది వాళ్ల అహారపు అలవాట్లను అపహాస్యం చేస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ లో జైనులు దొంగచాటుగా చికెన్ కబాబ్ తింటున్నారు. మోదీ ప్రభుత్వం మనుషుల వ్యక్తిగత స్వేచ్ఛనూ కాలరాస్తోందని ఆమె అన్నారు. అయితే తమ మతపరమైన విశ్వాసాలను ఆమె దెబ్బతీసిందని జైనులు మండిపడుతున్నారు. సోషల్మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తన రాజకీయం కోసం జైనుల మీద ఊహాజనిక కథలు అల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జైనుల ధర్మాన్ని అవమానించినందుకు మొయిత్రా క్షమాపణలు చెప్పాలని అంకిత్ జైన్ డిమాండ్ చేశారు. బంగాళా దుంపలు కూడా తినని జైనుల పట్ల మొయిత్రా చేసిన వ్యాఖ్య చాలా దారుణమని మాగీ అనే నెటిజన్ అన్నారు. మీ చిల్లర రాజకీయాల్లోకి మా జైనులను లాగొద్దని వేడుతూనే వార్నింగ్ ఇచ్చారు పరాగ్ జైన్ అనే మరో నెటిజన్. నేను భారతదేశంలోని ప్రతి జైనుల తరపున మహువా నుంచి క్షమాపణ కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. ఏ జైన్ కూడా నాన్ వెజ్ తినడు. మీ రాజకీయ ప్రయోజనం కోసం మా జైన సమాజాన్ని అవమానిస్తావా అంటూ తన్వీ జైన్ మండిపడ్డారు. అహింసను ఆచరించే వాళ్లం మేం. ప్రతీజీవి ప్రాణం ముఖ్యమే అని భావించేవాళ్లం. అలాంటి మమ్మల్ని అవమానిస్తావా..మా మత విశ్వాసాలను కించపరిచే హక్కు నీకెక్కడిది అంటూ సౌరభ్ జైన్ ట్వీట్ చేశారు. శాఖాహారం ముట్టని జైనులపై ఆమె చేసిన కామెంట్స్ చాలా హేయం. ఇంతలా ఓ మతాన్నిఅవమానించిన ఆమె క్షమాపణ చెప్పాలి, లేదా దావా వేస్తాం అని నిషాజైన్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.
జైనులు పూర్తి శాఖాహారులు, కనీసం రూట్స్ వెజిటబుల్స్ కూడా తినరు. అలాంటిది అహ్మదాబాద్ లోని జైనులు రహస్యంగా మాంసాహారం తింటున్నారన్న మహువా మొయిత్రా మాటలు నిజంగా వారి మనోభావాల్ని దెబ్బతీయడమే. గతంలోనూ పలుమార్లు ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరికీ టార్గెటయ్యారు ఈ టీఎంసీ మహిళా ఎంపీ.
https://twitter.com/WordsSlay/status/1489603796158513158?s=20&t=25yHnzFe_dg6wwb1Wac9GQ