జహంగీర్పురి హింస కేసులో హిందువులను బాధ్యులుగా చేసి ఇరికించే కుట్ర జరుగుతోంది విశ్వహిందూపరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులే తప్పు చేస్తున్నారని అలాంటి అధికారులను గుర్తించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానాను విశ్వహిందూ పరిషత్ కోరింది. నగరంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ఇస్లామిస్ట్ గుంపు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే నాటి హింసలో హిందువులను ఇరికించేందుకు పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వీహెచ్పీ ఆరోపిస్తోంది. హనుమాన్ జయంతి ఊరేగింపు నిర్వాహకులు ముందస్తు అనుమతి కోరారని, ఢిల్లీ పోలీసులు అందుకు తగిన విధంగా అనుమతి ఇచ్చారని.. అయితే జహంగీర్పురిలో హింస చెలరేగడంతో పోలీసులు యూ-టర్న్ తీసుకొని ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అంటోందని వీహెచ్పీ అంటోంది.
“ఏప్రిల్ 15న, మేం రెండు స్థానిక పోలీస్ స్టేషన్లకు లిఖితపూర్వకంగా తెలియజేసాము. నగరంలోని మరో 20 ప్రాంతాల్లో చేపట్టాల్సిన శోభాయాత్రల జాబితాను కూడా వాట్సాప్ ద్వారా పోలీసు కమిషనర్కు పంపాం’’ అని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. ఏప్రిల్ 17న అంటే జహంగీర్పురి హింసాకాండ జరిగిన మరునాడు షహదారా వద్ద జరగవలిసిన ఒక్క ర్యాలీకి తప్ప, ఊరేగింపుల రద్దు గురించి పోలీసుల నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. మా దగ్గర రికార్డులు ఉన్నాయి. కోర్టు అడిగితే మేం వాటిని కోర్టు ముందు హాజరుపరచగలమని పరిషత్ ముఖ్యులంటున్నారు. పోలీసులు అవాస్తవ ప్రకటనల ద్వారా కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది వీహెచ్పీ .
ఈ కేసులో కొందరు నిందితుల బెయిల్ పిటిషన్ లను కోర్టు తిరస్కరించింది. మత పరమైన ఊరేగింపును అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఊరేగింపులో శాంతిభద్రతల పరిరక్షణకు కేవలం ముగ్గురు పోలీసులను మాత్రమే మోహరించినందున హింసకు పోలీసులే పూర్తి బాధ్యత వహించాలని వినోద్ బన్సాల్ అన్నారు. ఊరేగింపుకు అవసరమైన అనుమతులు లేవని కోర్టు చేసిన పరిశీలనపై ఆయన స్పందిస్తూ, “అయితే ఊరేగింపుతో తరలిస్తున్నప్పుడు పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు? వారు దానిని మొదట్లోనే ఎందుకు ఆపలేదు?అని నిలదీశారు.
ఓ యాత్రజరిగే సందర్భంలో అక్కడ శాంతిభద్రతలు పరిరక్షణ బాధ్యత పోలీసుల విధి అని…అల్లర్లు జరగకుండా చూడాల్సింది పోలీసులే అని..కానీ అక్కడ సరిపడా సిబ్బందేలేదని వినోద్ బన్సాల్ గుర్తు చేశారు.