ఢిల్లీ రాజధానిలోని జహంగీర్ పురిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ చేపట్టిన చర్యలను సుప్రీంకోర్టు బుధవారం నిలిపేసింది. ఈ అంశంపై యధాతథ స్థితి ని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది.
#WATCH | Anti-encroachment drive underway at the Jahangirpuri area of Delhi which witnessed violence on April 16 during a religious procession pic.twitter.com/zIxMVccwSM
— ANI (@ANI) April 20, 2022
హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా శనివారం ఈ ప్రాంతంలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మైనర్లు, 25 మంది వయోజనులను ఈ కేసులో అరెస్టు చేశారు. ఈ క్రమంలో అల్లరిమూకల అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కి లేఖ రాశారు. దీంతో ఆక్రమణల కూల్చివేత డ్రైవ్ ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కొన్ని ఆక్రమణలను తొలగించింది.
BIG : Advocate Dushyant Dave & Kapil Sibal filed plea in Supreme Court against #Bulldozer in Jahangir Puri
Representing Jamiat Ulema e hind , same organisation is fighting case for islamic terrorists convicted in Ahemdabad blast
Supreme has given stay against Bulldozer
— Live Adalat (@LiveAdalat) April 20, 2022
ఈ నేపథ్యంలో ఈ చర్యలను నిలిపేయాలని కోరుతూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ, జహంగీర్ పురి ఏరియాలో అనధికారికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆక్రమణలను తొలగిస్తున్నారని ఆరోపించారు. న్యాయవాది దుష్యంత్ దవే, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ జహంగీర్ పురిలో బుల్డోజర్ లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి జమియత్ ఉలేమా ఇ హింద్ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇదే సంస్థ అహ్మదాబాద్ పేలుళ్లలో దోషులుగా తేలిన ఇస్లామిక్ ఉగ్రవాదుల కోసం కూడా పోరాడుతోంది.