హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై.. టీడీపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చెల్లెలు షర్మిల సైతం ఆయనపేరు మార్చవద్దన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరును మార్చడం తెలుగు జాతికి అవమానమన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధులను కూడా దోచుకున్నారని, స్నాతకోత్సవం జరుపుకోవడానికి కూడా డబ్బులు లేవని మండిపడ్డారు బాబు.
అసలు ఎన్టీఆర్ పేరు తీసెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది?.. ఎన్టీఆర్కు వైఎస్సార్తో పోలిక ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ గొప్ప అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలన్నారు. వర్శిటీకి గవర్నర్ ఛాన్సలర్గా ఉన్నారని, పేరు మార్పుపై గవర్నర్ను అడిగారా? అని చంద్రబాబు నిలదీశారు. మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.