ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానిమోదీతో భేటీ అయ్యారు.పోలవరం పనులు, తెలంగాణ నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్, కేంద్రం నుంచి ఏపీకి రావల్సిన నిధులు సహా పలు అంశాలపై జగన్ పీఎంతో చర్చించారు. ఇద్దరూ దాదాపు గంటపాటు మాట్లాడుకున్నారు. రెండు రోజుల డిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రే ఢిల్లీ చేరుకున్న ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా అధికార నివాసానికి వెళ్లారు. ప్రధానిని కలిసిన అనంతరం అటవీశాఖామంత్రి భూపేంద్ర యాదవ్ తోనూ మోదీ సమావేశమయ్యారు. రాత్రి పదిగంటలకు అమిత్ షానూ కలవనున్నారు జగన్ .