ఆంధ్రప్రదేశ్ లో అట్టర్ ప్లాప్ అయిన వైయస్ జగన్ పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జగన్ కు ఆయన సొంత పార్టీ కార్యకర్తలు.. కడుపు మండిపోయి,, బహిరంగ లేఖ రాసినట్లు చెబుతున్నారు. జగన్ చేసిన తప్పిదాలను స్పష్టంగా ఎత్తిచూపుతూ ఈ లేఖన ప్రయోగించారు.
…………….
గౌరవనీయులైన జగన్ గారికి,, మీ పార్టీ కార్యకర్త రాసుకొనే విన్నపములు..
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి నీ వెంట నడిచి, 2014లో ఓడిన నీ వెంట సైన్యంలా నిలబడ్డాం.తిరిగి 2019లో గెలిచే వరకు పోరాటం చేశాం.
నవరత్నాలు అంటూ పాలన మొదలు పెట్టి ఎంతో మంది కార్యకర్తల కష్టాలు,నష్టాలు ఆక్రందనలు నీకు ఎక్కడ వినపడలేదు.కనపడలేదు.
నేను విన్నాను,నేను ఉన్నాను అంటూ డైలాగ్ చెప్పి కార్యకర్తల పేరు కూడా ఎక్కడ ఎత్తలేక పోయావు..
నా వాలంటీర్లు మానస పుత్రికలు అంటూ మొదలు పెట్టి కార్యకర్తలను తొక్కి నార తీసావు.అద్దాల మేడ లో కూర్చుని బటన్ నొక్కాను.నా పని అయిపోయింది మీరే చేయాలి అంటూ ఎమ్మెల్యేలకు హిత బోద చేశావు..చివరికి నువ్వు మునుగుతూ మొత్తానికి కార్యకర్తలను ముంచి,వారికి ఎక్కడ గౌరవం లేకుండా చేశావు.
ఒక ఎంపీపీ, ఒక జడ్పీటిసి,ఒక మున్సిపల్ చైర్మన్ కావాలి అంటే బిసిలకు 50%ఇవ్వాలి అంటూ తాడేపల్లి నుంచి ఆదేశాలు ఇచ్చావు.. ఎమ్మెల్యేలకు స్వతంత్రం లేకుండా నాది,నేను అంటూ తలకు ఎక్కించుకుంటే జరిగే అనర్ధాలు ఎలా ఉంటాయో,. ఇప్పుడు తెలుస్తోంది.
2011నుంచి నీతో నడిచిన కార్యకర్తలు అధికారం వచ్చాక ఎందుకు దూరం అయ్యారో ఏ రోజు అయిన ఆలోచించావా…బాగోగులు చూసావా..కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలు ఓడిపోలేదా అంటూ నీ భజన పరులు ప్రచారం చేసిన రోజు కూడా నువ్వు నోరు తెరవలేదు..
కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అయ్యాయి,,,, అయినా నీ కోసం పని చేశారు.చిన్న ఉద్యోగాలు కానీ,, ఆర్ధిక సహాయం కానీ చేశావా.. పార్టీ కోసం ఖర్చు పెట్టి ఆర్దికంగా చితికి పోయినప్పటికీ .. నీ ఎమ్మెల్యేలు కానీ నువ్వు కానీ ఏ రోజు అయిన పట్టించుకున్నవా!
ఒక్క గెలుపు తో హీరో,మరో ఓటమితో జీరో అయ్యావు..ఎందుకు ఓడిపోయావు అని నీకు అర్దం కాకపోతే నాలాంటి వాడిని అడుగు..5నిమిషాలు మాట్లాడితే నీ బలం ఎంటి?నీ బలహీనతలు ఎంటో 2నిమిషాలలో చెబుతాడు..
కార్యకర్తలను మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ…నాయకులను మోసం చేసిన కార్యకర్తలు లేరు..
కార్యకర్తలు లేకుండా యుద్ధానికి సిద్దం అయ్యావు..Ipac టీమ్ సేవలు గుర్తించావు కానీ కార్యకర్తలు సేవలు గుర్తించే ఓపిక నీకు లేదు.. చివరకు ఆ ఐపాక్ టీము నిన్ను పూర్తిగా ముంచింది అయినా మీరు కళ్ళు తెరుచుకోవడం లేదు.
నువ్వు నమ్ముకున్న భజన సంఘం,నీ Ipac టీమ్,నీ సోషల్ ఇంజినీరింగ్ నిన్ను పూర్తిగా ముంచి వేశాయి..
నిజాయితీ గా పని చేసే ఏఒక్కరికి అవకాశాలు ఇవ్వలేదు.2014ఎన్నికలలో టీడీపీకి పని చేసిన సర్వే సంస్థలు గాలి లెక్కలు వేసి ఇస్తే అవే నిజం అని భ్రమలో ఉన్నావు..యదార్ధంగా నీ కోసం పని చేసే వారిని నువ్వు గుర్తించకపోవడం తో … మానుకొని వెళ్లిన వారు కోకొల్లలు…చెప్పుకుంటూ పోతే తీరని వేదనలు, అవమానాలు తప్ప ఓరిగింది ఏమి లేదు..
ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారు ఆశిస్తున్న
ఒక సగటు కార్యకర్త
…………….
ఈ పేరుతో తయారైన లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది నిజంగానే వైసీపీ కార్యకర్త రాసినదా … లేక,, టిడిపి సోషల్ మీడియా ఫ్యాక్టరీ ల్లో పుట్టిందా అన్నది తెలియని విషయం.