ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చర్చించనున్నారు. ప్రధాని ఆధ్వర్యంలో ఢిల్లీలోనే ఇటీవల నిర్వహించిన జీ20 సన్నాహక సదస్సుకు జగన్ హాజరైన సంగతి తెలిసిందే. జీ 20 కి ఈసారి భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు కీలక సూచనలూ చేశారు జగన్. అందుకు సంబంధించి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని చెప్పిన జగన్…దానిపైనే ఇటీవలే మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ పాల్గొన్నారు.