ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారుతుంది అన్న మాట వినిపిస్తోంది ఇప్పటికే తెలుగుదేశం జనసేన బిజెపి ఒకే మాట ఒకే బాటగా కలిసిపోయి పనిచేస్తున్నాయి దీంతో వైసిపి పరిస్థితి ఒంటరి పక్షి మాదిరిగా అయిపోయింది వరుస పెట్టి కేసులు పడుతుండేసరికి వైసిపి నేతలు విలవిల లాడిపోతున్నారు. దీంతో ఏదైనా ఆసరా దొరుకుతుందా అని వైసిపి ఎదురుచూస్తోంది.
ఇదే అదనుగా వైసీపీని దగ్గర తీసేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీ వేదికగా నిరసన తెలపాలని వైసిపి నిర్ణయించుకున్నప్పుడు కాంగ్రెస్ చకచకా పావులు కదిపింది. హస్తినలో నిరసన తెలిపేందుకు దగ్గర ఉండి స్థలం ఇప్పించడంతో పాటు అనుమతులు కూడా రప్పించారు. అంతటితో ఆగిపోకుండా మిత్రపక్షాల నేతలు పంపించారు.
జగన్ టీం తో ఇండియా కూటమి నేతలు ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.జగన్ ఇండియా కూటమి మద్య చర్చలు సఫలం కావడం వల్లే జంతర్ మంతర్ వద్ద జగన్ తలపెట్టిన ధర్నాకి సమాజ్ వాది పార్టీ, TMC, AIDMK , DMK,ఉద్ధవ్ శివసేన, ఇండియన్ ముస్లీంలీగ్ తృణమూల్ కాంగ్రేస్ పార్టీ ల నేతలు తరలి వచ్చారని తెలుస్తోంది.
అటు జగన్ కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం జనసేన బిజెపి మూకుమ్మడిగా తనమీద దాడి చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో బిజెపి పెద్దల ఆశీస్సులతోటే తెలుగుదేశానికి ఇంతటి మెజారిటీ దక్కింది అని నిర్ధారణ అయింది. పార్లమెంటులో బిజెపికి మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా తనమీద దాడి కొనసాగుతూ ఉండటం జగన్ను కలిసి వేస్తుంది. మరోవైపు రాయలసీమలో వైయస్ షర్మిల బలపడే కొద్ది తన పార్టీకి ఇబ్బంది తప్పదు. అందుచేత షర్మిలాను ఏపీ నుంచి పంపించాలి అంటే కాంగ్రెస్కు దగ్గర కావలసిన అవసరం ఏర్పడుతోంది. కేసులను వంకగా చూపించి ఇండియా కూటమికి దగ్గర కావాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
కానీ ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. జగన్ పీక మీద కేసులు అనే కత్తి వేలాడుతూ ఉంది. బిజెపితో సున్నం పెట్టుకుంటే ఈ కేసులకు సంబంధించి బెయిల్ రద్దు అయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే మరోసారి జగన్ జైలు పక్షిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బిజెపితో గొడవ పెట్టుకున్న పాపానికి కేసీఆర్ ఇప్పుడు విలవిల లాడుతున్నారు. గారాలపట్టి అయిన కూతురు కవితను జైలు నుంచి విడిపించుకోలేక అష్ట కష్టాలు పడుతున్నారు. కళ్ళ ముందు ఈ పరిస్థితిని చూసి కూడా జగను సాహసం చేసి కాంగ్రెస్ వైపు వెళ్తారా అనేది ఒక ప్రశ్న.