ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ వరసగా తప్పటడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి ఆయన మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. తాజాగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కి రాసిన లేక చాలామందికి నవ్వు తెప్పించింది.
ఈ లేఖ విషయంలో మనం కొన్ని విషయాలు గమనించాలి. సాధారణంగా ఎవరికైనా లేఖ రాసినప్పుడు ఆ వ్యక్తి కి సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ ని కోట్ చేస్తుంటాం. ఆ తర్వాత మన పట్ల పాజిటివ్గా నిర్ణయం తీసుకొని కోరుకుంటాం. కానీ వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాసిన లేఖ ఇందుకు భిన్నంగా ఉంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాల్సిందిగా విన్నవిస్తూ ఈ లేఖను రాశారు కానీ ఇదే లేఖలో …..
గతంలో అయ్యన్నపాత్రుడు తమను విమర్శించారని అటువంటి వ్యక్తిని స్పీకర్ గా ఎలా చేస్తారని జగన్ ప్రశ్నలు లేవనెత్తారు అంటే స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఎంపిక నచ్చలేదు అని ముఖం మీద చెప్పేశారు మరి అటువంటి అప్పుడు అయ్యన్నపాత్రుని రిక్వెస్ట్ చేస్తే ఈ విన్నపాన్ని ఆయన ఎంతవరకు మన్నిస్తారు.. అసలు ఎందుకు మన్నించాలి..!
సాధారణంగా స్పీకర్ ఎన్నిక అనేది సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. లోక్సభలో స్పీకర్ పదవి కోసం అధికార పక్షాన నుంచి ప్రతిపక్షం నుంచి పోటీ జరిగింది ఎన్నిక తర్వాత ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు స్పీకర్ కొత్త స్పీకర్ను వెంటబెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభాధ్యక్షులు స్థానం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి గౌరవం పలికారు. అది సభకు సంబంధించిన సాంప్రదాయం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎన్నికైనప్పుడు సాంప్రదాయాన్ని మన్నించి జగన్మోహన్ రెడ్డి కూడా సభకు హాజరైతే బాగుండేది. అధ్యక్ష స్థానం దాకా తీసుకుని వెళ్లి గౌరవించినట్లయితే మర్యాదగా ఉండేది. ఆ సాంప్రదాయాన్ని తిరస్కరించి అయ్యన్నపాత్రుడు ఎన్నిక తనకు ఇష్టం లేదు అని ముఖం మీద చెప్పేశాక… ఆయన నుంచి పాజిటివ్ నిర్ణయం ఎలా ఆశించగలుగుతాం.
ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. వైసిపి పార్టీ శాసనసభ్యులు 10 మంది కలిసి ,, తనను శాసన సభ పక్ష నాయకుడిగా ఎన్నుకొన్నట్లు ప్రోటెమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లేఖ ఇవ్వాలి . అప్పుడు ఆ లేఖను తీసుకుని వరుస క్రమంలో ప్రమాణ స్వీకారానికి పిలిచేందుకు అవకాశం ఏర్పడుతుంది.కానీ,
ఆ లేఖ ఇవ్వనప్పుడు వైఎస్సాఆర్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు గా జగన్ ను ప్రోటెమ్ స్పీకర్ ఎలా గుర్తిస్తారు?. ఇక్కడే జగన్ చేసిన పొరపాటు దొరికిపోయింది. అధికారికంగా లేఖ ఇవ్వనప్పటికీ.. గతంలో సీఎం పదవి నిర్వహించారు కనుక మంత్రుల తర్వాత జగన్ ను ప్రమాణ స్వీకారం కోసం పిలిచారు.
ఇక, అసలు విషయం చూద్దాం.ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వడానికి 10% సీట్లు ఉండాలనే నిబంధన లేదు అని జగన్ వాదిస్తున్నారు. కానీ, 10% సీట్లు రాకున్నా.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూల్ కానీ, నిబంధన గానీ ఉన్నదా? ఉంటే దానిని ఎందుకు లేఖలో ఉదహరించలేదు?
సభ నిర్వహించాలి అంటే తగిన కోరం ఉండాలని రాజ్యాంగం చెబుతుంది అంటే ఎన్నికైన సభ్యులు పదోవంతమంది తప్పనిసరిగా ఉండాలి. అలాగే కోరం సంఖ్య కన్నా ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీల్లో పెద్ద పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 సీట్లు ఉన్నాయి కాబట్టి 18 మంది కంట ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది..
అయితే సూటిగా స్పష్టంగా పదోవంతో సభ్యులు ఉండి తీరాలి అని రాజ్యాంగంలో లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని అడగవచ్చు. కానీ ఈ విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయం. ఒకవైపు స్పీకర్ను విమర్శిస్తూ మరోవైపు ఆయన నిర్ణయం కోసం ఎదురుచూడడం అంటే దురాశ అనుకోవాలి.
అందుకే జగన్ రాసిన లేఖ మీద సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ నడుస్తోంది. రాజకీయాల్లో సెల్ఫ్ గోల్ చేసుకుంటే ఫలితం అనుభవించాల్సిందే ఆయా రాజకీయ నాయకులే.