శ్రీకాకుళం రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురిని గుర్తింపు కార్డుల ఆధారంగా అసోంకు చెందిన వారిగా నిర్థారించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. గాయపడిన వ్యక్తి అదే రైల్లో శ్రీకాకుళం తీసుకువచ్చి రిమ్స్ లో చేర్చారు. తరువాత సీఎం ఆదేశంతో మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు.
సోమవారం సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న రైలుకు శ్రీకాకుళం జిల్లా జి. సగడాం- బాతువ సమీపంలో బ్రేక్ బైండింగ్ పడింది. రైలును ట్రాక్ పై నిలిపిన సిబ్బంది రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే లోపల ఉక్కబోత భరించలేక కొందరు గాలి కోసం రైలు దిగారు. అదే సమయంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొంది.దీంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా..ఒకరికి గాయాలయ్యాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)