ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ITBP) లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సహా భారతదేశం-చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణులలో యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ ప్రతి ఏటా యోగాను ప్రచారం చేస్తోంది. ఉత్తరాన లడఖ్ నుంచి తూర్పున సిక్కిం వరకు, ITBP జవాన్లు 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ యోగాసనాలు వేశారు. వివిధ ప్రదేశాలలో యోగా సాధన చేస్తున్న ITBP సిబ్బంది ఫోటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ ఆవుతోన్నాయి.
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లద్దాఖ్ లో పలువురు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది 17,000 అడుగుల ఎత్తులో యోగా చేశారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ITBP సిబ్బంది ఇదే విధమైన యోగా సెషన్ను నిర్వహించారు, అక్కడ వారు 16,500 అడుగులు, 16,000 అడుగుల ఎత్తులో యోగా చేశారు.
ఇదిలా ఉండగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన హిమ్వీర్లు సిక్కింలో గడ్డకట్టే మంచు ఉన్న ప్రాంతంలో 17,000 అడుగుల ఎత్తులో యోగా సాధన చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ITBP ఓ పాటను కూడా జాతికి అంకితం చేసింది.
గౌహతిలోని లచిత్ ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నదికి ఎదురుగా ITBP 33 బెటాలియన్ యోగా సెషన్ నిర్వహించింది.
లోహిత్పూర్లో ATS వద్ద ఉన్న హిమవీర్ లు గుర్రాలతో యోగా సాధన చేశారు.