రాజస్థాన్ లోని అల్వార్లో అభివృద్ధి పనుల సాకుతో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఈ విషయమై ఏప్రిల్ 27న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యోగేష్ మిశ్రాపై ఒక ముస్లిం గుంపు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని కలిగించడానికి పార్టీ ఆలయ కూల్చివేత డ్రైవ్ను ఉపయోగించిందని ఆరోపించింది. సాహూ అనే ముస్లిం యువకుడు ఫిర్యాదు చేశాడు. కూల్చివేతకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారణమని, స్థానిక ముస్లింలకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని ఆరోపించారు.
రాజ్గఢ్లోని దేవాలయాల కూల్చివేత వెనుక మొత్తం పాత్ర కాంగ్రెస్దే. ముఖ్యంగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాధ్యుడని.. ముస్లింలమైన మాకు దీనితో సంబంధం లేదని అతనంటున్నాడు. దేవాలయాలు కూల్చాలని తమకులేదని… అది కాంగ్రెస్ పనేనని వారి ఎమ్మెల్యేనే అక్కడికి వెళ్లారని అన్నారు.
ఇతర ముస్లింలూ ఈ ఘటనపై ఆందోళన చెందుతున్నారు.
ప్రశాంతమైన అల్వార్లో ఎన్నడూ ఇలాంటి అల్లర్లు జరగలేదని…ఇప్పుడే కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సాహూన్ గతంలో కాంగ్రెస్ కార్యకర్త. ఆలయ కూల్చివేత వ్యవహారంపై ఆయన పార్టీకి రాజీనామా చేశారు. “కాంగ్రెస్ జిల్లా అధినేత యోగేష్ మిశ్రా రాజ్యాంగ విరుద్ధ ప్రసంగం చేశారు.. తన ప్రసంగంతో ప్రజలను రెచ్చగొట్టాడని ఆరోపించారు. ఏదైనా మతపరమైన ఆలయం, మసీదు దగ్గర ఏదైనా జరిగితే, ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించాడు. తాను నిరసన తెలిపిన తర్వాత, పార్టీ వివరణ కోరిందని పేర్కొన్నారు. తన ప్రసంగాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆరోపించిన మిశ్రా మరుసటి రోజు ఒక వీడియోను విడుదల చేశారు. అయితే తాను మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెప్పలేదు. సాహూన్ పార్టీని కాపాడటానికి ప్రయత్నిస్తూ.. మిశ్రాపై మొత్తం నిందను మోపాడు.
సదర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి రాజేష్ శర్మ ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటారని మీడియాతో అన్నారు.
రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతంలో అభివృద్ధి సాకుతో ఏప్రిల్ 22న కాంగ్రెస్ ప్రభుత్వం 300 ఏళ్ల నాటి శివ ఆలయాన్ని కూల్చివేసింది. ఆలయాన్ని కూల్చేందుకు అధికారులు బుల్డోజర్ను ఉపయోగించారు. ఆలయంలోని పురాతన శివలింగాన్ని డ్రిల్ సాయంతో విరగొట్టారు. కూల్చివేత సమయంలో పురాతన శిల్పాలు విరిగిపోయాయి.
ఈ వ్యవహారంలో స్థానికులకు నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంకేష్ మీనా ఆరోపించగా, స్థానికులు దానిని తోసిపుచ్చారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం తాము బిజెపి కౌన్సిలర్లను ఎన్నుకున్నందున ఈ ప్రాంతంపై ప్రతీకారం తీర్చుకుందని ఆలయం చుట్టూ ఉన్న నివాసితులు నిందించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)