భారత దేశంలో కశ్మీర్ ను విలీనం చేయడంలో జాప్యం చేసింది నెహ్రూనేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈవిషయంలో హరికిషన్ దే తప్పని… జమ్ముకశ్మీర్ ను భారత్ లో కలిపే విషయంలో ఊగిసలాటలో ఉన్నారని… చివరకు పాకిస్తాన్ దాడి చేయడంతో తన రాజ్యాన్ని భారత్ లో కలిపారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన ట్వీట్లపై రిజిజు స్పందించారు.గాంధీ, నెహ్రూమీద ఉన్న గౌరవంతో షేక్ అబ్దుల్లా చొరవతోనే కశ్మీర్ను పూర్తిగా భారత్ లో కలపగలిగారనీ అన్నారు.
ఇటీవలే సొంత రాష్ట్రంలో గుజరాత్ పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశంలోని సంస్థానాలు, చిన్నచిన్నరాజ్యాలను దేశంలో విలీనం చేసే బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నారని… అయితే కశ్మీర్ సమస్యను ఓ వ్యక్తి పరిష్కరించలేకపోయారనీ అన్నారు. దీంతో జైరాం రమేశ్ ట్వీట్ చేస్తూ నెహ్రూ తప్పేంలేదన్నారు.
https://twitter.com/KirenRijiju/status/1580170869304745984?s=20&t=E6tk6tNlmjmJKTPLa-gcsA
అయితే జైరాం రమేశ్ ట్వీట్లను గట్టిగా బదులిచ్చారు కిరణ్ రిజిజు. జమ్మూ-కశ్మీరుపై సందేహాస్పద, అనుమానాస్పద, అస్పష్ట పాత్రను జవహర్లాల్ నెహ్రూ అనుసరించారని ఆరోపించారు.ఆయన్ని కాపాడ్డం కోసం కాంగ్రెస్ ఇన్నేళ్లు అబద్దం చెబుతూ వస్తోందన్నారు. ఆ సమయంలో నెహ్రూ చెప్పిన విషయాలనే ప్రస్తావించారు వరుస ట్వీట్లతో రిజిజు. జమ్మూ-కశ్మీరును భారత దేశంలో కలపడం కోసం మహారాజా హరిసింగ్ మొట్టమొదటిసారి నెహ్రూను కలిసినది 1947 జూలైలో అని … అంటే స్వాతంత్ర్యం రావడానికి ఒక నెల ముందే నెహ్రూను మహారాజా కలిశారన్నారు. మహారాజా ప్రతిపాదనను తిరస్కరించినది నెహ్రూయేనని తెలిపారు. ‘‘కశ్మీరుకు సంబంధించి, ఆగస్టు 15కు ముందే, బహుశా జూలైలో, మా మధ్య అనధికారికంగా చర్చకు వచ్చింది’’ అని నెహ్రూ చెప్పినట్లు తెలిపే ఆధారాలను ట్వీట్ కు జతచేశారు.
అంటే జమ్ముకశ్మీర్ భారత్ లో కలవడంలో జాప్యానికి కారణం మహారాజు హరిసింగ్ కానేకాదని… నెహ్రూయోనని ఆయన మాటలను బట్టే తెలుస్తోందనీ అన్నారు. ఇతర సంస్థానాలు, చిన్నరాజ్యాల అధినేతల్లాగే కశ్మీర్ రాజు హరిసింగ్ కూడా 1947 జూలైలోనే నెహ్రూను కలిశారని…మిగిలిన రాజ్యాల విలీనానికి ఒప్పుకున్న నెహ్రూ కశ్మీర్ విలీనానికి మాత్రం అంగీంకరించలేదన్నారు.
https://twitter.com/KirenRijiju/status/1580170888141369345?s=20&t=E6tk6tNlmjmJKTPLa-gcsA
‘‘కశ్మీరు అంశం మొదట అనధికారికంగా మా ముందుకు వచ్చినపుడు, – అది ఎప్పుడూ మా ముందు ఉంది- కానీ అది దాదాపు జూలై లేదా జూలై మధ్యలో అనధికారికంగా మా మధ్యకు వచ్చింది. కశ్మీరు రాజ్యానికి మేం ఇచ్చిన సలహా ఏంటంటే, ఇంకా చెప్పాలంటే, మాకు అక్కడి పాపులర్ ఆర్గనైజేషన్ నేషనల్ కాన్ఫరెన్స్తో, దాని నేతలతో సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మాకు మహారాజా ప్రభుత్వంతో కూడా సంబంధాలు ఉన్నాయి, అయితే అవి అస్పష్టమైన సంబంధాలు, కానీ వారు మాతో సంప్రదించారు. వారిద్దరికీ మేం ఇచ్చిన సలహా ఏంటంటే, కశ్మీరు చాలా ప్రత్యేకమైన విషయం, ఆదరాబాదరాగా ఏదో చేసేయడం సరైనది కాదు. మేం విధించిన సాధారణ సూత్రం ఏంటంటే, కశ్మీరు రాజ్యంలోని ప్రజలను సంప్రదించాలని చెప్పాం. ఇది ప్రత్యేకంగా కశ్మీరుకు వర్తిస్తుందని చెప్పాం. ఇది దేశ విభజనకు పూర్వం జరిగింది. స్వాతంత్ర్యం వాస్తవంగా రావడానికి పూర్వం జరిగింది. మహారాజా, ఆయన ప్రభుత్వం భారత దేశంలో కలవాలని కోరుకున్నప్పటికీ, మాకు అంతకన్నా ఎక్కువ కావాలని స్పష్టంగా చెప్పాం. అది ఏమిటంటే, ఆ చర్య తీసుకోవడానికి ముందు ప్రజల ఆమోదం తప్పనిసరి అని చెప్పాం. చాతుర్యంతో కూడిన చిట్కాలతో కాగితంపై ఏదో సాధించాలని మేం కోరుకోలేదు’’ అని నెహ్రూ స్వయంగా చెప్పారని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
https://twitter.com/KirenRijiju/status/1580170895879905281?s=20&t=E6tk6tNlmjmJKTPLa-gcsA
స్వాతంత్ర్యం వచ్చాక…. 1947 అక్టోబరులో కూడా నెహ్రూ ఊగిసలాటను ప్రదర్శించారని రిజిజు అన్నారు.
‘‘ఆ సమయంలో మహారాజా ప్రభుత్వం నుంచి, అదేవిధంగా కశ్మీరులోని పాపులర్ ఆర్గనైజేషన్ నుంచి మాకు ఇండిపెండెంట్ అపీల్స్ వచ్చాయి. సహాయం కోసం, భారత దేశంలో కలవడం కోసం ఈ విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని చాలా సుదీర్ఘంగా, చాలా ఆత్రుతతో పరిశీలించాం, పర్యవసానాలు మొదలైనవాటి గురించి పరిశీలించి, ఆలోచించడానికి ప్రయత్నించాం. ఆ తర్వాత సత్వర నిర్ణయానికి రావలసి వచ్చింది. నాకు గుర్తుంది, అది అక్టోబరు 27 కావచ్చు, అక్షరాలా రోజంతా కూర్చుని చర్చించిన తర్వాత ఆ రోజు సాయంత్రం మేం ఓ నిర్ణయానికి వచ్చాం. అనేక రిస్క్లు, ప్రమాదాలు ఇమిడియున్నప్పటికీ, ఆ విజ్ఞప్తికి ‘కాదు’ అని చెప్పలేకపోయాం, మేం అక్కడికి వెళ్ళి సహాయం చేయవలసి వచ్చింది. ఇది అంత సులువైన విషయం కాదు….’’ అని నెహ్రూ చెప్పారని కిరణ్ రిజిజు గుర్తుచేశారు.
https://twitter.com/KirenRijiju/status/1580517282157318145?s=20&t=E6tk6tNlmjmJKTPLa-gcsA