పట్నాలో విపక్షనేతల భేటీని ఫోటో సెషన్ గా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నరేంద్ర మోదీని, ఎన్డీయేను వాళ్లు ఏకం అయినా ఓడించలేరని.. 2024 ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుచుకుంటున్నామని జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్నాలో 15 పార్టీల నాయకులు సమావేశమైన సంగతి తెలిసిందే.
నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ కూడా హాజరయ్యారు.