బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీకి చెందిన ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం పదకొండున్నర నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సందర్భంగా సంస్థ సిబ్బంది ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అకౌంటింగ్ డిపార్ట్ మెంట్ కు చెందిన కంప్యూటర్లను అధికారులు తనిఖీ చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే బీబీసీ మోదీకి వ్యతిరేకంగా ‘ఇండియా.. ది మోదీ కొశ్చన్’ అనే పేరుతో డాక్యుమెంటరీ టెలికాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బీబీసీ కార్యాలయాల్లో తాము సర్వే చేస్తున్నామని… సోదాలు కాదని ఐటీ అదికారులు తెలిపారు.
అటు బీబీసీపై సోదాలను ఖండించాయి కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ సహా పలు పలుపార్టీలు. ఆదానీ వ్యవహారంపై జేపీసీ విచారణ చేయమని తాముడిమాండ్ చేస్తే…బీజేపీ ప్రభుత్వం మాత్రం బీబీసీపై దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
https://twitter.com/ANI/status/1625392253165514752?s=20&t=k3UPIDdk-rGH6OgC3YkZzg