బీబీసీ కార్యాలయాల్లో మూడోరోజూ ఐటీ అధికారుల సర్వేలు కొనసాగుతున్నాయి. సంస్థకు చెందిన ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే సమాచారంతో ‘సర్వే’లు నిర్వహిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా అందులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులనుంచి వారికి కావల్సిన ఆర్థిక సంబంధిత సమాచారాన్ని , ఇతర వివరాల్ని అధికారులు సేకరించారు. అయితే ఈ సర్వే ఎప్పుడు పూర్తవుతుందనేది ఇప్పుడే చెప్పలేమని…తమకు లభించే సమాచారం, ఆధారాల్ని బట్టి ఉంటుందని ఐటీ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ పన్నులు, బీబీసీ అనుబంధ సంస్థల ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సమస్యల్ని పరిశోధించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.