ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసేలా ఆదేశాలివ్వాలంటూ ముంతాజ్ మన్సూరి పిటిషన్ దాఖలు చేశాడు. అయితే వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఇష్టంవచ్చినట్టు మాట్లాడడానికి లేదని కోర్టు మందలించింది. ఈ దేశ రాజ్యాంగం ప్రతీ పౌరుడికి వాక్ స్వచ్ఛ ఇచ్చిందని…అయితే ఆ హక్కును దుర్వినియోగం చేస్తూ సాక్షాత్తూ ప్రభుత్వాధినేతను, మంత్రులను ఇష్టంవచ్చినట్టు మాటలంటా అంటే కుదరదని… జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా జస్టిస్ రాజేంద్ర కుమార్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మోదీ, షా సహా మంత్రులను మన్సూరీ కుక్కలని వ్యాఖ్యానించాడు. సోషల్మీడియాలో వారిపట్ల అనుచితమైన భాష వాడుతూ పోస్టులు పెట్టాడు. పలువురి ఫిర్యాదు మేరకు ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ 504 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ ముంతాజ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
ఎఫ్ఐఆర్ రద్దుకు నిరాకరించిన కోర్టు ….అధికారులు ఈవిషయంలో చట్టప్రకారం ముందుకు వెళ్లవచ్చని…దర్యాప్తు చేసిన తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
https://twitter.com/LiveLawIndia/status/1548342276258091008?s=20&t=2I6-oB4mQ4dsKEG6iR4mRw